నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం తగదని అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు.
పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ పరిధిలో డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు. వరదల నేపథ్యంలో ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షిస్తూ అధికంగా వర్షాలు కురుస్తున్నందునా నియోజకవర్గంలో చెరువుల కట్టలు తెగకుండా చూసుకోవాలని, కింది స్థాయి అధికారులందరు గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు.
ఆర్.డబ్యు.ఎస్ అధికారులతో సమీక్షిస్తూ.నియోజకవర్గం లో ఇంకా ఎక్కడ మిషన్ భగీరథ వాటర్ సప్లై లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని అలాగే ఇంకా కొనసాగుతున్న పనులుంటే పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మిషన్ భగీరత వాటర్ సప్లై పనులు చేయాలని అన్నారు.
సమీక్షలో రెవెన్యూ ఆర్డీఓ శ్రీనివాస్, డి. సి.ఓ సింహాచలం, ఆర్.డబ్యు.ఎస్ ఎస్.ఈ రాజేంద్ర కుమార్, డి. ఎల్.పి.ఓ శ్రీనివాస్, పి. ఆర్ డీఈ మహేందర్, ఆర్.అండ్.బి ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Heavy rains | భారీ వర్షాలతో తడిసి ముద్దయిన తెలంగాణ
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్