అహ్మదాబాద్: గోశాలల్లోని ఆవుల సంరక్షణ కోసం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెండితో తులాభారం నిర్వహించారు. ఇలా వచ్చిన 85 కేజీల వెండిని ఆయన విరాళంగా ఇచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్త్ మహాజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ తులాభారం నిర్వహించారు. రాష్ట్రంలో పాడి పశువుల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా రూపానీ స్పష్టం చేశారు. ఆవులను చంపిన వారికి 12 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే కఠిన చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక పతంగుల పండుగలో గాయపడిన పక్షుల చికిత్స కోసం కరుణ అభియాన్ ప్రారంభించామని, దీనికితోడు గోశాలలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం