రంగారెడ్డి : కుటుంబ కలహాలతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉదయ్ భాస్కర్ కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ వైస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న కల్పన(30) కుటుంబ గొడవల కారణంగా కోమటి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్యన గొడవలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే భర్త గొడవ పెట్టుకొని వెల్లిపోయాడన్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన కల్పన తిరిగి రాలేదన్నారు. గురువారం ఉదయం కల్పన మృతదేహం చెరువులో పైకి తేలడంతో స్థానికులు చూసి మీర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువులోంచి కల్పన మృతదేహాన్ని పోలీసులు భయటకు తీశారు. భర్త కారణంగానే ఆత్మహత్య చేసుకుందా?ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.