కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్ పరిస్థితి దృష్ట్యా ఆక్సన్ ఎయిడ్ సంస్థ వారు జిల్లాకు 22 లక్షల విలువచేసే 40 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మర్సుకోల తిరుపతితో కలిసి జిల్లాలోని పీహెచ్సీలకు ఒకటి చొప్పున పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఆక్సిజన్ పరిస్థితుల దృష్ట్యా ఈ కాన్సెంట్రేటర్లు వైద్య సేవలు పొందుతున్న రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే