హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఐఐటీ మద్రాస్లో 1993లో చదివిన పూర్వ విద్యార్థులు రూ.1.5 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల ప్రతినిధి సురేశ్బాబు, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం బీఆర్కేభవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఐఏఎస్ అధికారి రాహుల్బొజ్జా మద్రాస్ ఐఐటీ నుంచి 1993లో పట్టభద్రుడయ్యారు. ఐఐటీ మద్రా స్ పూర్వ విద్యార్థుల దాతృత్వాన్ని సీఎస్ ఈ సందర్భంగా ప్రశంసించారు.