హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య కూడా ఉంటాడు. ఆయనకి సరిపోయే విజయాలు ఇప్పటి వరకు రాలేదు. కెరీర్ కొత్తలో ఊహలు గుసగుసలాడే, మొన్నటికి మొన్న చలో ఇలాంటి సినిమాలు తప్పితే ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలు అయితే లేవు. అయితే వరుస సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న వరుడు కావలెను షూటింగ్ పూర్తి చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య ఈ సినిమాను తెరపైకి వస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హీరో నాగశౌర్యతో పాటు హీరోయిన్ రీతూ వర్మ కూడా డబ్బింగ్ ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంటానని నమ్మకంగా చెబుతున్నాడు నాగశౌర్య. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని పిడివి ప్రసాద్ సమర్పిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్ నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.