లండన్ : కరోనా వైరస్ తాజా వేరియంట్స్కు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వైరస్ నూతన వేరియంట్స్ను నియంత్రించేందుకు ఇది అవసరమని వారు అంచనా వేశారు. జర్నల్ వైరస్ ఎవల్యూషన్లో పరిశోధకులు ఈ అథ్యయనాన్ని ప్రచురించారు. ప్రస్తుతం సాధారణ జలుబు కరోనా వైరస్లుగా పేరొందిన నాలుగు వైరస్ల జన్యు ఎదుగుదలను జర్మనీకి చెందిన వైరాలజిస్టులు అథ్యయనం చేసి ఈ పరిశోధన చేపట్టారు.
కరోనా వైరస్ల స్పైక్ ప్రొటీన్లో మార్పులను వీరు పసిగట్టారు. ఈ అథ్యయనంలో కరోనా వైరస్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్లో ఉమ్మడి లక్షణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్లన్నింటిలో నిచ్చెన వంటి ఎవల్యూషనరీ షేప్ను కనుగున్నారు. దీంతో ఇది నిరంతరం రూపు మార్చుకుంటూ మానవ శరీరంలో రోగ నిరోధకతను హరిస్తుందని తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయన రచయిత వెండీ కె జో తెలిపారు. కరోనా వైరస్ స్థిరమైన పరిస్థితికి చేరాకే వ్యాక్సిన్ల సామర్ధ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని వైరాలజిస్టులు పేర్కొ్న్నారు. అప్పటివరకూ కరోనా వైరస్ తాజా వేరియంట్స్కు అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.