వరంగల్ : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన అమరుడైన జూలై 4వ తేదీన ఆయన స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి లో ఆవిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు కడవెండి నుంచి వచ్చిన దొడ్డి కొమురయ్య వారసులు, గ్రామస్తులు, మండల నాయకుల సమక్షంలో హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో కొమురయ్య సంస్మరణ ఉత్సవాల పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. ఆనాడు ఆయన ప్రాణ త్యాగం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందన్నారు. నాటి హైదరాబాద్ దేశానికి నైజాం, రజాకార్ల నుండి విముక్తి కలగడానికి బాటలు వేసిందన్నారు. ప్రజలు తమ విముక్తికోసం సాయుధులై సమర శంఖం పూరించేలా పురికొల్పింది అని మంత్రి చెప్పారు.
దొడ్డి కొమురయ్య గురించి సందర్భం వచ్చినప్పుడల్లా, సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తారని అన్నారు, ఆయన నా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన వాడు కావడం గర్వకారణం అన్నారు. అందరి భాగస్వామ్యంతో ఆ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ