వైద్యులే నిజమైన దేవుళ్లు : మంత్రి ఈటల

పెద్దపల్లి : ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పాలిట వైద్యులే దేవుళ్లని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ముఖ్యఅతిథగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాన్ని నిర్వహించటం ఎంతో అభినందనీయమన్నారు.
ప్రతిమ ఫౌండేషన్, కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి సేవా కార్యక్రమాల్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత,జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత, ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ చెన్నమనేని వికాస్, డాక్టర్ దీప, రాంచందర్ రావు, ప్రేమ్ సాగర్ రావు, గ్రామ సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, జెడ్పీటీసీ పుస్కురి పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న జగన్
- మహేష్ ఫిట్నెస్ గోల్స్.. వీడియో వైరల్
- ‘కొవిడ్ నెగెటివ్’ నిబంధన ఎత్తేసిన పూరీ జగన్నాథ్ ట్రస్ట్
- శాకుంతలం చిత్రంపై గాసిప్స్.. క్లారిటీ ఇచ్చిన గుణశేఖర్
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి