డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రదానం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఇండో-ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ 28వ వార్షికోత్సవాల్లో ఈ డాక్టరేట్ను ప్రదానం చేసింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పరిచేందుకు అసోసియేషన్ విశేషంగా కృషి చేస్తున్నదని చెప్పారు. ఇరు దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన పలువురికి డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ తరఫున డాక్టరేట్లను ప్రదానం చేశారు.