నేడు గీతం స్నాతకోత్సవంలో ప్రదానం
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి గీతం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నది. హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగే 12వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ను ప్రదానం చేస్తామని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. మూడు దశాబ్దాలకుపైగా పారిశ్రామిక అనుభవం ఉన్న కృష్ణప్రసాద్.. 1984లో పారాసిటమాల్ తయారీని ప్రారంభించి, అమెరికాకు ఔషధాలు ఎగమతి చేసిన మొదటి భారతీయ కంపెనీల్లో ఒకటిగా గ్రాన్యూల్స్ ఇండియాను నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఆరోగ్యం, విద్య, ఉపా ధి, సంక్షేమ రంగాల్లో గ్రామీణప్రాంతాలను మెరుగుపరిచేందుకు కృషిచేసే స్వర్ణభారత ట్రస్ట్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.