హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ టోర్నీల్లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా సత్తాచాటడమే లక్ష్యంగా మనోళ్లు ముందుకు సాగుతున్నారు. బెంగళూరు వేదికగా జరిగిన 19వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ మోహన్ హర్ష కాంస్య పతకంతో మెరిశాడు. వైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని నిరూపిస్తూ హర్ష రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపజేశాడు.