హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): అనుమతిలేకుండా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను చేపట్టవద్ద ని ఏపీ సర్కారుకు కేఆర్ఎంబీ గురువారం మరోసారి లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడి కాలువ పనులను చేపడుతున్నది, వాటిని ఆపేలా ఆదేశించాలని తెలంగాణ ప్రభు త్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదుచేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ ఈ లేఖ రాసింది. ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కాలువ పనులతోపాటు, అనుమతుల్లేకుండా ఎలాంటి ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్లను అందివ్వాలని స్పష్టంచేసింది. ఏపీ ఫిర్యాదు మేరకు తెలంగాణ సర్కారుకు సైతం కేఆర్ఎంబీ లేఖను రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ జెన్కోను కోరింది.