హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వృత్తి విద్యాకాలేజీలు, విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడిచేయవద్దని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఫీజు మొత్తాన్ని మూడు లేదా నాలుగు వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని పేర్కొన్నది. పరిస్థితులు కుదుటపడే వరకు ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఈ సమాచారాన్ని కాలేజీలు వెబ్సైట్లలో పొందుపరచడంతోపాటు ఈ మెయిల్ ద్వారా విద్యార్థులకు చేరవేయాలని తెలిపింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ ఎస్ సహస్రబుద్దే మంగళవారం ఓ సర్క్యులర్ జారీచేశారు.