మహబూబాబాద్ : ఏపుగా పెరిగే మొక్కలను విద్యుత్ లైన్ల కింద నాటొద్దని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ పరిధిలోని నర్సంపేట బైపాస్ రోడ్డులో అవెన్యూ ప్లాంటేషన్ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా నర్సంపేట రోడ్డులోని డీఆర్సీ కేంద్రం వద్ద అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు సిమెంటు రోడ్డు బ్లాస్టింగ్ పనులను రోడ్లు భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణ ముఖ ద్వారాలను అందంగా తీర్చి దిద్దేందుకు అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు తప్పనిసరిగా నాటాలన్నారు. విద్యుత్ వైర్ల కింద ఎత్తుగా ఎదిగే మొక్కలను నాటరాదని అధికారులకు సూచించారు. అనంతరం కురవి మండల కేంద్రానికి సందర్శించి బోదకాలు వ్యాధి మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల ఇంజినీరింగ్ అధికారులు ఈఈ తానేశ్వర్, డీఈ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, కురవి ఎంపీడీవో ధన్ సింగ్, వైద్యాధికారి శ్వేత మున్సిపల్ ఏఈ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద