అందోల్/సంగారెడ్డి : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి చోటివొద్దని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో ఆర్డీవో నగేష్, జిల్లా సివిల్ సప్లై, డీఎంసీఎస్, అందోల్, పుల్కల్, చౌటకూర్, వట్పల్లి మండలాల పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరిధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాలకు లారీల కొతర, తడిసిన ధాన్యం కొనుగోళ్లు వంటి కీలక అంశాలపై చర్చించారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడటంతోపాటు, రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్స్ యాజమాన్యాలకు ఎమ్మెల్యే సూచించారు.
నియోజకవర్గంలోని రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. అలాగే తడిసన ధాన్యం విషయంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం