పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 3లో భారత మహిళల రికర్వ్ జట్టు పుంజుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. దీపికా కుమారి, అంకిత, కోమలికతో కూడిన భారత త్రయం క్వాలిఫికేషన్ రౌండ్లో 1986 పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. కాగా తొలిస్థానంలో మెక్సికో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్ పోటీల రెండో రౌండ్లో కొలంబియా చేతిలో అనూహ్యంగా భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే.