వరంగల్ రూరల్ : కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జంక్షన్ లో ధాన్యం తరలింపునకు లారీల కోసం ఎదురుచూస్తున్న రైతులు, అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమం పూర్తికావస్తుందని, ధాన్యం తరలింపుకు లారీల యజమానులు సహకరించాలని నచ్చచెప్పి అక్కడే ఉన్న ఖాళీ లారీలను కేంద్రాలకు తరలించారు.
రైతులు కూడా సాద్యమైనంత వరకు గ్రామాలలో ఉండే వాహనాలను ధాన్యం తరలింపునకు వాడుకోవాలని సూచించారు. రైతుల కోసం పోలీస్, రెవెన్యూ శాఖ చేస్తున్న పని తీరును ఎమ్మెల్యే అభినందించారు.
కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ఆలస్యం జరగకుండా అధికారులు చూసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట రెవెన్యూ, పోలీస్ అధికారులు తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి