కరీంనగర్ : కరోనా వ్యాక్సిన్పై అపోహలను నమ్మవద్దని, అర్హులందరూ నిశ్చింతగా వేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నదని, ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, నిర్ణిత దూరం పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు.
జిల్లాలోని హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోని టీకా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట కర్ఫ్యూ విధించామని చెప్పారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట జడ్పీచైర్ పర్సన్ విజయ, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి