కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి దళితబంధును ఆపడం గొప్పకాదని.. దమ్ముంటే ఈ పథకంలో భాగస్వామ్యులై కేంద్రం నుంచి 50 శాతం నిధులు తెచ్చి మాట్లాడాలని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సవాల్ విసిరారు. బుధవారం హుజూరాబాద్లో మత్స్యకారులతో సమావేశమైన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దళితుల కోసం అమలు చేస్తున్న దళితబంధుపై కొందరు ఫిర్యాదు చేసి ఆపేయిం చారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా దళితబంధు ఆగదని, వచ్చే నెల 2 తర్వాత పథకం తిరిగి అమలవుతుందని స్పష్టంచేశారు. ఏడేండ్లు అధికారంలో ఉన్నపుడు ముదిరాజ్ బిడ్డనని చెప్పు కోని ఈటలకు ఎన్నికలప్పుడే ఆ విషయం గుర్తొ చ్చిందని ఎద్దేవాచేశారు. ఏదో చేస్తాడని బండి సంజయ్ని ఎంపీగా గెలిపించిన ప్రజలకు గడిచిన రెండున్నరేండ్లలో కనీసం గంట సమయాన్ని కూడా కేటాయించలేదని విమర్శించారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయికే తక్కువని ఎద్దేవాచేశారు. హుజూరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి కనీసం 100 కోట్ల ప్యాకేజీ తేవాలని, ప్యాకేజీ తెచ్చిన తర్వాతనే ఈటల, బండి ఓట్లు అడగాలని తలసాని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వదించిన గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్ర మంలో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీలు బండ ప్రకాష్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, నోముల భరత్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.