సంగారెడ్డి : గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సాయిగావ్ లలో వర్షాలు బాగా కురుస్తుండటంతో సింగూరు(బాగారెడ్డి)ప్రాజెక్టు కు వరద ఉధృతి కొనసాగుతుందని ఆదివారం ప్రాజెక్ట్ ఏఈ మజార్ మహ్మద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్ట్ లోకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులు, మత్స్యశాఖ కార్మికులు ఇలాంటి సందర్భాల్లో నది పరివాహక ప్రాంతాలకు వెళ్లక పోవడమే మంచిదని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.585 టీఎంసీల నీటి మట్టం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి