సూర్యాపేట టౌన్, జూన్ 3: లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక ఇబ్బంది పడుతున్న రిక్షా కార్మికులను ఆదుకోవడం అభినందనీయమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని 45వ వార్డులో కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన బియ్యం పంపిణీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆపత్కాలంలో పేదలకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కౌన్సిలర్ పావని మాట్లాడుతూ.. 160 మంది రిక్షా కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాశ్, గండూరి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.