హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉపఎన్నికలో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు తెలిపింది. ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఈ సందర్భంగా స్పందిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ జయకేతనం ఎగురవేసిందన్నారు. పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటూ పట్టం కడుతున్నారన్నారు. కేసీఆర్ అలోచన, ఆచరణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని మరోసారి సాగర్ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా సౌతాఫ్రికాశాఖ తరఫున ప్రచారం చేసిన అందరికి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.