నారాయణఖేడ్, మే 17: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో అన్ని సదుపాయాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నదని, దీనిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ ఏరియా దవాఖానను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీశారు. పీపీఈ కిట్ ధరించి నేరుగా కొవిడ్ రోగులను కలిసి వారికి అందిస్తున్న వైద్యం, సమకూరుతున్న సదుపాయాలను తెలుసుకున్నారు. కొవి డ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాం ట్ను పరిశీలించారు. దవాఖానలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో కొవిడ్ రోగులకు అవసరమైన మందుల నిల్వల గురించి దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగ్చౌహాన్ను అడిగి తెలుసుకున్నారు.
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం..
దవాఖానను పర్యవేక్షించిన అనంతరం ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందుతున్నదని, ఆక్సిజన్తో పాటు ఇతర మం దులు అందజేస్తున్నట్లు వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దవాఖానలో కొవిడ్ బాధితుల కోసం 70 పడకలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం నలుగురు రోగులకు చికిత్స పొందుతున్నారన్నారు. అధైర్యపడకుండా పౌష్టికాహారం తీసు కోవాలని వారికి ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ బాధితులకు వైద్య సేవలకు సంబంధించి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా తనతో పాటు ప్రజాప్రతినిధులను ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా కేసులు చాలా వరకు తగ్గినట్లు చెప్పారు.
దవాఖాన ప్రారంభం..
నారాయణఖేడ్లో నూతనంగా ఏర్పాటైన ఓ ప్రైవేట్ దవాఖానను సోమవారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడి ప్రజల ఆర్థిక స్థోమతను దృష్టిలో ఉంచుకుని అందరికీ అందుబాటులో ఉండేవిధంగా వైద్య సేవలందించాలని దవాఖాన వైద్యులు దేవరాజ్, సంజయ్ మిఠారేలకు సూచించారు.