మహబూబాబాద్ : స్వచ్ఛంద సేవలో బాల వికాసది ప్రత్యేకమైన స్థానం. అనేక సేవలు చేస్తూ అందరి మెప్పు పొందిన ఘనత బాల వికాసది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్నారు. జిల్లాలోని తొర్రూరులో బాలవికాస ఆధ్వర్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా కష్ట కాలంలో తెలంగాణ వ్యాప్తంగా బాల వికాస 3 వేల 500 మంది నిరుపేద కుటంబాలకు కోటి రూపాయలతో నిత్యావసర సరుకులను పంపిణి చేసిందన్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు తొర్రూర్ లో కరోనా పాజిటివ్ వచ్చిన 250 మంది నిరుపేద కుటంబాలకురూ.5 లక్షలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. బాల వికాస సేవలను మరింత విస్తృతం చేయాలని, రాష్ట్ర ప్రజలందరికి ఈ సేవలు అందాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో శౌరి రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.