ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 : పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు రాజ్యం ఏర్పడినప్పుడే నిత్యావసర ధరలు తగ్గుతాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకువస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు వెంకట్రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యుడు ఎజాజ్, తదితరులు పాల్గొన్నారు..