వరంగల్ : రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల ఆనందం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్లోని 40వ డివిజన్ ఉర్సు సీఆర్సీ భవన్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండగ అన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో సంతోషం నింపాలని పండక్కి బతుకమ్మ చీరెలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్లి రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.