హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంయుక్తంగా బుధవారం ప్రభుత్వ దవాఖానలు, చారిటీ ఆర్గనైజేషన్లకు 60 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళం ఇచ్చాయి. దవాఖానలకు ఇవ్వనున్న కాన్సన్ట్రేటర్లను సైబరాబాద్ సీపీ సజ్జనార్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఐఐ మాజీ అధ్యక్షుడు వీ రాజన్న మాట్లాడుతూ.. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కాన్సన్ట్రేటర్లను అందజేసినట్టు తెలిపారు.
అద్దె కార్ల సంస్థ ‘ఓలా’ తమ యాప్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు బుక్చేసుకునే అవకాశాన్ని కల్పించడంతోపాటు, వాటిని ఉచితంగా డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఓలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టినట్టు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం తెలంగాణలో దీనిని ప్రారంభించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.