హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా రాష్ట్రంలో అర్హులైన సుమారు 3 లక్షల 9 వేల 83 కొత్త కార్డుల్లోని 8.65 లక్షల లబ్దిదారులకు ఆగష్టు నుండి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున ఆగస్టు నుండి నవంబర్ వరకు నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకై అదనంగా నెలకు రూ.23.10 కోట్లతో 4 నెలలకు రూ.92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయన్నట్లు మంత్రి చెప్పారు. ఆగస్టు నెల పంపిణి 3వ తేదీ నుండి ప్రారంభిస్తామని తెలియజేసారు.