హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): బోర్డులతో తూములు, కాల్వల నిర్వహణ నష్టాలు తెస్తుందని, తెలంగాణ నీటి కలలకు విఘాతం ఏర్పడుతుందని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ అన్నారు. గురువారం సాయంత్రం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో ఇంజినీర్ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు అతిముఖ్యమైన జలసంపదను దూరంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో నీటి కష్టాలు ఉండకూడదని సీఎం కేసీఆర్, ఇంజినీర్లు రేయింబవళ్లు శ్రమించి కాళ్వేరం లాంటి బృహత్తర ప్రాజెక్టులను పూర్తి చేశారని, కాల్వలకు తూములు ఏర్పాటు చేసుకొని చెరువులు, కుంటలు నింపుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం జారీచేసిన గెజిట్తో నీటి ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్తాయని, తద్వారా తెలంగాణకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని అన్నారు. నదులు, నీటి వనరులకు సరిహద్దులు గుర్తించి వాటికి రక్షణ ఎందుకు చేపట్టడం లేదో ఆలోచించాలని చెప్పారు. ఈ సభలో విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ జే విజయ్ప్రకాశ్, విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, ఐఈఐ చైర్మన్ డాక్టర్ రమణా నాయక్, సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఐఈఐ కార్యదర్శి టీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.