హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యతిరేకించారు. రాష్ర్టాలను సంప్రదించకుండానే వాటి పరిధిలోని విద్యుత్తు కంపెనీలను ప్రైవేటీకరించే బిల్లును తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ఏకపక్షంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదింపచేసుకొని వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ప్రమాదకరమైన బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.