రంగారెడ్డి, ఏప్రిల్ 1, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నూతన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంతో ఓవైపు పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో దూసుకుపోతుండడంతోపాటు పన్నులు కూడా భారీగా వసూలయ్యా యి. పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాలను చేపట్టి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ప్రతి నెల నిధులను విడుదల చేస్తూ కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఆస్తి పన్నును చెల్లిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వన్టైం సెటిల్మెంట్ పథకం కింద ఏడాదికి చెల్లించే మొత్తం ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించినట్లయితే 50 శాతం రాయితీని కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో గతేడాదికి మించి ఆస్తి పన్ను వసూళ్లయ్యాయి. జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్దేశించిన లక్ష్యంలో 85 శాతం పన్ను వసూలయ్యింది. అదేవిధంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 91 శాతం పన్ను వసూ లు కావడం గమనార్హం. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో గతేడాది కేవలం 80 శాతం పన్ను వసూలుకాగా ఈ ఏడాది 11 శాతం అదనంగా పన్ను వసూలయ్యింది. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శిని నియమించడంతోపాటు ప్రజల్లో వచ్చిన చైతన్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి జిల్లాలోని ఐదు మండలాల్లో 100 శాతం పన్ను వసూళ్లు కావడం గమనార్హం.
మున్సిపాలిటీల్లో రూ.96.10 కోట్లు వసూలు
జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో 20 20-21 ఆర్థిక సంవత్సరానికిగాను 112 కోట్ల ఆస్తి పన్ను ను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా మార్చి 31 నాటికి రూ.96.10 కోట్ల ఆస్తి పన్ను వసూలయ్యింది. మరో రూ.16.76 కోట్ల పన్ను వసూలు పెండింగ్లో ఉంది. సంబంధిత బకాయిలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెనాల్టీతో కలిసి బకాయిదారుల నుంచి వసూలు చేయనున్నారు. జిల్లాలోని శంషాబాద్, షాద్నగర్, కొత్తూరు, తుర్కయంజాల్ మున్సిపాలిటీల్లో భారీగా పన్ను వసూలయ్యింది. మణికొండ మున్సిపాలిటీలో రూ.22.59 కోట్లు లక్ష్యంకాగా రూ.19.48 కోట్లు, మీర్పేట్ కార్పొరేషన్లో రూ.9.94 కోట్లు లక్ష్యంకాగా రూ. 9.05 కోట్లు, నార్సింగి మున్సిపాలిటీలో 10.73 కోట్లు లక్ష్యంకాగా రూ.9.09 కోట్లు, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలో రూ.8.54 కోట్ల లక్ష్యానికి రూ.6.89 కోట్లు, షాద్నగర్లో రూ.3.51 కోట్ల లక్ష్యానికి రూ.3.35 కోట్లు, శంషాబాద్లో రూ.4.01 కోట్ల లక్ష్యానికి రూ.3.94 కోట్లు, శంకర్పల్లిలో రూ.1.48 కోట్ల లక్ష్యానికి రూ.1.20 కోట్లు, తుక్కుగూడలో రూ.3.18 కోట్ల లక్ష్యానికి రూ. 2.75 కోట్లు, ఆదిభట్లలో రూ.1.93 కోట్ల లక్ష్యానికి రూ. 1.42 కోట్లు, బడంగ్పేట్లో రూ.19.57 కోట్ల లక్ష్యానికి రూ.15.44 కోట్లు, బండ్లగూడజాగీర్లో రూ.10.59 కోట్ల లక్ష్యానికి రూ.8.98 కోట్లు, ఆమనగల్లులో రూ. 49.94 కోట్ల లక్ష్యానికి రూ.36.26 కోట్లు, కొత్తూరులో రూ.1.45 కోట్లకుగాను రూ.1.38 కోట్లు, జల్పల్లిలో రూ.3.37 కోట్లకుగాను రూ.2.77 కోట్లు, ఇబ్రహీంపట్నంలో రూ.6.11 కోట్లకుగాను రూ.5 కోట్లు, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రూ.5.31 కోట్లకుగాను రూ.4.94 కోట్ల పన్ను వసూలయ్యింది.
పంచాయతీల్లో రూ.20.36 కోట్లు
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో భారీగా ఆస్తి పన్ను వ సూలయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో రూ.22.86 కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.రూ.20.36 కోట్ల పన్ను వసూలయ్యింది. జిల్లాలోని ఆమనగల్లు, చౌదరిగూడ, కేశంపేట్, కొందుర్గు, తలకొండపల్లి మండలాల్లో వంద శాతం ఆస్తి పన్ను వసూలు కావడం గమనార్హం. ఆమనగల్లు మండలం లో రూ.11.71 లక్షలు, చౌదరిగూడెం మండలంలో రూ.31.84 లక్షలు, కేశంపేట్ మండలంలో రూ.34.78 లక్షలు, కొందుర్గు మండలంలో రూ.40.04 లక్షలు, తలకొండపల్లి మండలంలో రూ.30.81 లక్షల పన్ను వసూలయ్యింది. మిగతా అన్ని మండలాల్లో 90 శాతానికిపైగా గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలయ్యింది.
అబ్దుల్లాపూర్మెట్ మండలంలో రూ.2.09 కోట్లకుగాను రూ. 1.78 కోట్లు, చేవెళ్ల మండలంలో రూ.1.45 కోట్లకుగాను రూ.1.36 కోట్లు, ఫరూఖ్నగర్లో రూ.1.36 కోట్లకుగాను రూ.1.28 కోట్లు, ఇబ్రహీంపట్నంలో రూ.85.79 లక్షలకుగాను రూ.79.68 లక్షలు, కడ్తాల్లో రూ.44.90 లక్షలకుగాను రూ.37.34 లక్షలు, కొత్తూర్లో రూ.56.26 లక్షలకుగాను రూ.55.43 లక్షలు, మాడ్గులలో రూ.23. 61 లక్షలకుగాను రూ.23.48 లక్షలు, మహేశ్వరంలో రూ.1.38 కోట్లకుగాను రూ.1.24 కోట్లు, మంచాలలో రూ.46.46 లక్షలకుగాను రూ.40.22 లక్షలు, మొయినాబాద్ లో రూ.3.31 కోట్లకుగాను రూ.3.15 కోట్లు, నందిగామలో రూ.1.97 కోట్లకుగాను రూ.1.80 కోట్లు, షాబాద్లో రూ.98.43 లక్షలకుగాను రూ.88.51 లక్షలు, శంషాబాద్లో 1.85 కోట్లకుగాను రూ.1.59 కోట్లు, శంకర్పల్లిలో రూ.1.83 కోట్లకుగాను రూ.1.65 కోట్లు, యా చారం మండలంలో రూ.1.13 కోట్లకుగాను రూ.1.06 కోట్ల ఆస్తి పన్ను వసూలయ్యింది.
ఇవీ కూడా చదవండీ..
స్పుత్నిక్-వీ దరఖాస్తు.. నేడు ఎస్ఈఓ భేటీ
85 శాతం కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాల్లోనే: కేంద్రం