హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ అడిషనల్ డైరెక్టర్గా ఐఆర్ఎస్ అధికారి దినేశ్ పరుచూరి నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అభిషేక్ గో యల్ను ముంబై జోన్-2కు బదిలీ చేశారు. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ జితేంద్ర కుమార్ గొగియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు.. ఏవైనా ప్రత్యేక కేసులకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, కోర్టు కమిటీల్లో సభ్యులుగా ఉన్నట్టయితే ఆ కేసుల పర్యవేక్షణ సైతం చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.