చందంపేట: డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తుండటంతో డిండి వాగులో నీరు చేరి కొత్త జలకళను సంతరించుకుంది. మండలంలోని దేవరచర్ల, ఉస్మాన్ కుంట, చాపలగేటు, ఎలమలమంద గ్రామాలు డిండి వాగు సమీపంలో ఉండటంతో డిండి వాగు నుంచి రాకపోకలు నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి డిండి వాగులో నీరు చేరడంతో డిండి వాగు నిండి జలకళలాడుతుంది.
దీంతో ఆయా గ్రామాల సమీపంలోని రైతులు పంటలకు సైతం ఈ నీటిని వినియోగించుకుంటున్నారు. అదే విధంగా మహ బూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలకు సంబంధించిన గ్రామాలు నల్లగొండ జిల్లా సరిహద్దులో ఉండటంతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచాయి.