న్యూఢిల్లీ : దేశంలో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 35కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 57.36లక్షలకుపైగా మోతాదులు అందించినట్లు పేర్కొంది. 18-44 సంవత్సరాల కేటగిరిలో 28,33,691 మందికి మొదటి, మరో 3,29,889 మందికి రెండో మోతాదు వేసినట్లు చెప్పింది. మూడో విడుత టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేటగిరిలో మొత్తం 9,94,34,862 మంది తొలి, మరో 27,12,794 మందికి రెండో మోతాదు అందించినట్లు వివరించింది.