హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): భూసమస్యలన్నింటికీ పరిష్కారం.. లావాదేవీల్లో పారదర్శకత.. రికార్డుల డిజిటలైజేషన్తో రాష్ట్రంలో రెవె న్యూ వ్యవస్థ నూతనశకం మొదలై ఏడాది పూర్తయిం ది. గతేడాది సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ‘నూతన రెవెన్యూ చట్టం-2020’ను ప్రవేశపెట్టారు. భూ లావాదేవీల్లో డిజిటల్ విప్లవానికి పునా ది వేశారు. ‘ఇకపై రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవహారాలన్నీ డిజిటల్ వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తున్నాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే నెల 22న ఈ బిల్లు చట్టంగా మారింది. నాటినుంచి చట్టం విజయవంతంగా కొనసాగుతున్నది. చట్టం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన జరిగిన ప్రధాన మార్పులను పరిశీలిస్తే..
పారదర్శక లావాదేవీలు
ధరణి పోర్టల్ అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నదని, భూ సమస్యలన్నింటికీ పరిష్కారంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ గతేడాది అక్టోబర్ 29న మూడుచింతలపల్లి వేదికగా ధరణి పోర్టల్ను ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి లావాదేవీలు మొదలయ్యాయి. పోర్టల్ ఆధారంగా ఇప్పటివరకు అన్ని మాడ్యూల్స్ కలిపి 8 లక్షల వరకు లావాదేవీలు జరిగాయి. మరోవైపు అనేక సమస్యలకు ధరణిపోర్టల్లోని మాడ్యూల్స్ పరిష్కారం చూపుతున్నాయి.
అప్పటికప్పుడే మ్యుటేషన్
‘రిజిస్ట్రేషన్ కోసం ఒక ఆఫీస్కు, మ్యుటేషన్కు ఇంకోకాడికి పోవుడెందుకు?. ఇకపై మ్యుటేషన్ అధికారాలు ఆర్డీవోలకు తీసేసి ఎమ్మార్వోలకు ఇస్తున్నం. దఫ్తరు లేదు.. రశీదు లేదు.. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యు టే షన్ కూడా జరుగుతది’ అని సీఎం ప్రకటించారు. కొత్తచట్టంతో వచ్చిన మరో విప్లవమిది. భూముల రిజిస్ట్రేషన్తోపాటే అప్పటికప్పుడే మ్యుటేషన్లు జరుగుతున్నాయి. దీంతో రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతున్నది. ధరణిలో 6.81 లక్షల లావాదేవీలు నమోదుకాగా, వెంటనే మ్యుటేషన్లు జరిగాయి. ఎమ్మార్వోలకు జాయింట్ సబ్రిజిస్ట్రార్ హోదా ఇచ్చారు.
విచక్షణాధికారాలు కట్
భూరికార్డుల్లో అధికారులు ఇష్టమొచ్చినట్టు మార్పు లు చేర్పులు చేయకుండా విచక్షణాధికారాలు కూడా కట్ చేస్తామని కేసీఆర్ తెలిపిన మేరకు కిందిస్థాయి అధికారుల విచక్షణాధికారాలు రద్దయ్యాయి. కలెక్టర్కు మాత్ర మే రికార్డుల్లో మార్పులు చేర్పులు చేసే అధికారాన్ని ఇ చ్చారు. ఇదికూడా నిర్ణీతవ్యవస్థ ద్వారానే సాగుతున్నది.
రెవెన్యూ కోర్టులు రద్దు
‘రెవెన్యూశాఖ పరిధిలో తాసిల్దార్, ఆర్డీవో, జాయిం ట్ కలెక్టర్ల దగ్గర రెవెన్యూ కోర్టులు ఉన్నయి. వాళ్లే ఆర్డర్ పాస్చేసే అధికారులు, వాళ్లే తీర్పు ఇచ్చే జడ్జీలు. ఇది కరెక్ట్ అనిపించడం లేదు. అందుకే రెవెన్యూ కోర్టులు రద్దవుతాయి’ అనికేసీఆర్ ప్రకటించిన మేరకు రెవెన్యూ కోర్టులు రద్దుచేసి 16 ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేశారు. వీటిద్వారా 16,137 కేసులను పరిష్కరించారు. భూసమస్యలపై ధరణి పోర్టల్ ద్వారా వచ్చే వినతులను కలెక్టర్లు పరిశీలించిచర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల చేతికి భూముల వివరాలు
ధరణిలో వ్యవసాయ భూముల వివరాలన్నీ ఉంటాయని, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారైనా పోర్టల్ను ఓపెన్ చేసుకుని.. తమ భూముల వివరాలను చూడవచ్చని సీఎం పేర్కొన్నారు. ఆ ప్రకారం.. ధరణి పోర్టల్లో అన్నిరకాల వ్యవసాయ భూముల జాబితా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడున్నవారైనా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన భూమి వివరాలనైనా తెలుసుకొనే అవకాశం కలిగింది. పోర్టల్ను ఇప్పటివరకు 4.67 కోట్ల మంది వీక్షించారు.