హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యను డిజిటలైజేషన్గా మార్చేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు వేల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు, మూడు వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటుచేయనున్నారు. ఈ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో భరించనున్నాయి. కంప్యూటర్ ల్యాబ్లకు రూ.100 కోట్లు, డిజిటల్ క్లాస్రూంలకు రూ.70 కోట్లు నిధులిచ్చేందుకుగాను సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం ఇటీవలే ఆమోదముద్రవేసింది. 2021-22 విద్యాసంవత్సరంలో వీటిని చేపట్టేందుకు అనుమతినిచ్చింది. తెలంగాణలో 26,800 ప్రభుత్వ పాఠశాలున్నాయి. వీటిలో 22,34,084 మంది చదువుతున్నారు.
కార్పొరేట్ స్కూళ్లను మించి వసతులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సర్కారు బడులను ఆధునీకరించేందుకు పెద్దఎత్తున నిధులను ఖర్చుచేయనున్నారు. కరోనాతో ఆన్లైన్ తరగతులే ప్రత్యామ్నాయంగా మారిన నేపథ్యంలో ఆయా నిధులతో డిజిటల్ బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో అత్యధికంగా విద్యార్థులు స్కూళ్లను ఎంపికచేసి వాటిల్లోనే కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. స్కూళ్లల్లో ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ ల్యాబ్తోపాటు పాఠశాలకు రెండు చొప్పున తరగతి గదులను డిజిటల్ క్లాసురూంలుగా మార్చనున్నారు. వాస్తవానికి ఈ నిధులు గతంలోనే మంజూరయ్యాయి. కానీ, రెండేండ్లుగా కరోనా పరిస్థితుల కారణంగా వీటిని చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ విద్యాసంవత్సరం ఐదువేల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూంలను ఏర్పాటుకు అనుమతివ్వాలని సమగ్రశిక్షా అభియాన్ పీఏబీ సమావేశం ముందుంచారు. ఇందుకు కేంద్రం అనుమతివ్వడంతో నిధులను సద్వినియోగం చేసుకుని డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు.