గార్ల, జూన్ 13: మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్రావు అలియాస్ ప్రకాశ్ అనారోగ్యంతో మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన మోహన్రావు పీపుల్స్వార్ పోరాటాలకు ఆకర్షితుడై 1982లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నెల 10న మోహన్రావు అనారోగ్యంతో మృతిచెందాడని, 11న పోలీసులే అంత్యక్రియలు చేసి తమ కమిటీకి సమాచారం ఇచ్చారని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి జగన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించాడు.