రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కొడంగల్ నియోజకవర్గంలో శనివారం ప్రారంభిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.