సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీపీసీఆర్ సెంటర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లో ప్రజలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కిడ్నీ, లివర్, థైరాయిడ్, గుండెజబ్బులు వంటి 90 శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేయనున్నారు. టెస్టు చేసిన 24 గంటల్లోనే ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సెల్ఫోన్కు వస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులో కి రానున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.