హనుమకొండ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్కు జై కొడుతున్నారు. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.
కారు గుర్తుకే ఓటువేసి గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో మండల పార్టీ ఇంచార్జి పేరియాల రవీందర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.