జోగులాంబ గద్వాల : పేదింటి ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడేవారని తెలిపారు.
ఆడబిడ్డల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ వారి కష్టాలను దూరం చేసేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఆడ పిల్లల తల్లిదండ్రుల కష్టాలు తీరాయన్నారు. కార్యక్రమంలో పురపాలక చైర్మన్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్
చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే