భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు. జిల్లా కేంద్రమైన బాలేశ్వర్ సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను యమూర్భంజ్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి