హైదరాబాద్ : రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తికి నలుగురైదుగురు అవసరం ఉంటుంది. క్రయవిక్రయదారులు, సాక్షులు రావడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎస్ స్పష్టం చేశారు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి 21 తర్వాత రీషెడ్యూల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.