హైదరాబాద్ : ప్రస్తుత కరోనా సంక్షోభంలో గ్రాన్యూల్స్ ఇండియా తన సామాజిక బాధ్యతగా ఔదార్యంతో ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ను కలిసిన గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు. రూ.8 కోట్ల విలువైన 500 mg పారాసిటమాల్ మాత్రలను విరాళంగా ప్రకటించింది. బుధవారం నుండి వారానికి కోటి మాత్రలు ఉచితంగా ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపింది. రానున్న 4 నెలల్లో మొత్తం 16 కోట్ల మాత్రలు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా చికిత్సలో పారాసిటమాల్ మాత్రలు ఎంత విరివిగా వాడుతున్నారో తెలిసిందే.