హైదరాబాద్ : ధరణి రికార్డుల్లో యజమాని పేరుకు బదులు ఇల్లు/ ఇంటి స్థలం అని నమోదైన భూములపై వినతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో యజమానులు అందుబాటులో లేకపోవడం, సరైన పత్రాలు చూపెట్టకపోవడం లేదా అధికారుల తప్పిదం వల్ల కొన్ని సర్వే నంబర్లలోని భూములకు రైతు పేరుకు బదులుగా ‘ఇల్లు’ లేదా ‘ఇంటి స్థలం’ అని నమోదైంది. ఇలాంటి వాటిపై దరఖాస్తు చేసుకునేందుకు ధరణిలో ‘ఇష్యూ ఆఫ్ పీపీబీ ఆర్ నాలా కన్వర్షన్ వేర్ పట్టాదార్ నేమ్ ఈజ్ షోన్ యాజ్ హౌజ్/హౌజ్ సైట్’ అనే పేరుతో ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారు.