మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్తో రైతుల కడగండ్లు దూరమవుతున్నాయి. గతంలో భూమి పట్టా కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే దుస్థితి ఉండేది. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటి దగ్గరకు వచ్చి మరీ రిజిస్ట్రేషన్
చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తాజాగా జిల్లాలోని చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన చెకుర్తి రాజగోపాల రెడ్డి చెన్నూరు మండలంలోని పొన్నారం శివారులోని తన పేరుమీద ఉన్న భూమిని తన ఇద్దరు కుమారులకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించడానికి బుధవారం చెన్నూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఆయన 15 సంవత్సరాల నుంచి వెన్నుపూస నొప్పితో మంచానికి పరిమితమయ్యారు.
బుధవారం ఆయన కుమారులు సదరు పట్టేదారు ను అంబులెన్స్ లో చెన్నూరు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు.
వెంటనే విషయం తెలుసుకున్న చెన్నూరు తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే పట్టాదారు పరిస్థితి గమనించారు. ధరణి ఆపరేటర్ వినోద్ తో కలిసి తన లాప్ టాప్ తో అంబులెన్స్ వద్దకే వెళ్లి ఆ పట్టాదారు వేలిముద్రలు, ఫొటో తీసుకొని అంబులెన్స్ లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మానవీయంగా స్పందించిన అధికారులపై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
Cricket : పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Road accident : రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
కన్నేపల్లిలో శతాధిక వృద్ధురాలు మృతి
Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్లో 300 పోస్టులు