హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటుచేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరణిలో ఉన్న మా డ్యూల్స్ ద్వారా ప్రజలకు 50 రకాల సేవలు అందుతున్నాయి. ఒక్క గ్రీవెన్స్ రిలేటింగ్ టు స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ అనే మాడ్యూల్లో ఏకంగా 10 రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ధరణిలో ఇప్పటికీ కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కొందరు రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం పోర్టల్లో 90 శాతానికిపైగా భూముల రికార్డులు క్లియర్గా ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. మిగతా భూముల్లో చాలావరకు ఒక్కో సర్వేనంబర్కు ఒక్కో సమస్య ఉన్నది. వీటిపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి పరిష్కారం చూపుతుందని రైతులు ఆశిస్తున్నారు.
ధరణిలో కొన్ని ప్రధాన సమస్యలు