న్యూఢిల్లీ: కోవాగ్జిన్లు, రెమ్డెసివిర్లు ఏవీ అక్కర లేదు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలట. అదీ దేశీ గోమూత్రం అయితేనే ఫలితాలు ఉంటాయట. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఇచ్చిన సలహా ఇది. తాను రోజూ గోమూత్రం తీసుకుంటారట. అందుకే కరోనా ఇంతవరకు తన దరి జేరలేదట. అదీ సంగతి. ఈ మాత్రం మన వైద్యనిపుణులకు తెలియకపాయే. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందని ఆమె పేర్కొన్నారు. గోమూత్రం అపర సంజీవని ఆమె సెలవిచ్చారు. గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్ తగ్గిందని రెండేళ్ల క్రితం ప్రగ్య ప్రకటించారు. 2020 డిసెంబర్ లో కోవిడ్ లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. రుజువు కాని ప్రక్రియలతో ప్రామాల మీదకు తెచ్చుకోవగద్దని డాక్టర్లు పదేపదగే ప్రజలను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఆవుపేడ గానీ, గోమూత్రం గానీ కోవిడ్ రాకుండా చూస్తాయని లేదా వచ్చిన తర్వాత నయం చేస్తాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అనేకసార్లు ప్రకటించింది. కోవి్డ్-19కు వ్యత్రికంగా రోగనిరోధక శక్తిని గోమూత్రం, పేడ అందిస్తాయని ఎక్కడా రుజువు కాలేదని ఐఎంఏ అధిపతి డాక్టర్ జేఏ జయలాల్ తెలిపారు.