హైదరాబాద్ : కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రాష్ర్ట ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ను ఆదేశించారు. లాక్డౌన్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న డీజీపీ.. ఇవాళ ఉదయం ఆకస్మికంగా నాగోల్ చెక్పోస్టును తనిఖీ చేశారు. అక్కడ లాక్డౌన్ అమలుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని, వారిని అనుమతించాలన్నారు. జోన్ల వారీగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకున్న డీజీపీ.. నిబంధనలు ఉల్లంఘించే వారిని వదిలిపెట్టొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులకు కూడా డీజీపీ పలు సూచనలు చేశారు. నాగోల్ చెక్పోస్టు తనిఖీ కంటే ముందు బేగంపేట్ చెక్పోస్టును డీజీపీ పరిశీలించారు.